Pawan Kalyan: పవన్ భీమవరం సభలో కత్తి కలకలం.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

  • అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేసిన పోలీసులు
  • వారిలో ఒకరి నుంచి చాకు స్వాధీనం
  • పోలీసులపైనా దాడికి యత్నం
  • వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసులు
Two men arrested in Pawan meeting in Bheemavaram

  నిన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పాల్గొన్న సభలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు వారిని తనిఖీ చేయగా వారిలో ఒకరి వద్ద చాకు కనిపించింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పోలీసులపైనే ఒకడు దాడిచేశాడు. చివరికి టూటౌన్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

వారు జేబుదొంగలా? లేదంటే పవన్‌పై దాడి కోసమే సభకు వచ్చారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారని, వారిద్దరికీ ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. 

More Telugu News